రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

WGL: గీసుగొండ మండలం హర్జా తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పురాణాపూల్‌కు చెందిన భూక్య రవి (36) తన పల్సర్ బైక్‌పై సొంతూరు కొల్లాపురం వెళ్లి తిరిగి సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరాడు. టాటా ఏసీ వాహనం అతివేగంతో రవి బైక్‌ను ఢీకొట్టడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.