పబ్లిక్ రస్తాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్
KDP: ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెలో గురువారం రోడ్డు ఆక్రమణలను రెవెన్యూ, పోలీస్ అధికారులు తొలగించారు. మేకల పెద్ద నాగయ్య అనే వ్యక్తి రస్తాకు అడ్డుగా బండరాళ్లు ఏర్పాటు చేసి ఆక్రమించారని MRO గంగయ్య తెలిపారు. రూరల్ ఎస్సై, VTOలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ అడ్డంకులను తొలగించారు. ప్రజా రహదారులను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.