బిక్కనూర్లో పందుల బెడద
KMR: బిక్కనూర్లో పందుల బెడద ఎక్కువైంది. ప్రధాన రహదారులు, జనావాసాల మధ్య పందులు తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పందుల వల్ల మెదడువాపు వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పాలకవర్గ సభ్యులు, అధికారులు స్పందించి పందుల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.