'ఆర్డీటీని కాపాడుకోవడం మనందరి బాధ్యత'
సత్యసాయి: RDT సంస్థను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సీ జన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లాయప్ప పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే వినయ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుళ్లాయప్పతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ సంస్థ పేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.