మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎస్వీ రంగారావు సర్కిల్ వద్ద నూతనంగా ప్రారంభం కానున్న రైతు బజార్ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. రైతులకు సౌకర్యవంతమైన విక్రయ వేదికగా, వినియోగదారులకు తాజా పంటలను నేరుగా అందించే వేదికగా ఈ రైతు బజార్ నిలవనుందన్నారు. రేపు ఈ రైతు బజార్‌ను మంత్రి నాదెండ్ల ప్రారంభించనున్నారు.