యూరియా కోసం ఎండలో బారులు తీరిన రైతులు

SRPT: యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సుమారు 600 బస్తాల యూరియా రావడంతో తెల్లవారుజాము నుంచే వెయ్యి మంది రైతులకు పైగా ఆధార్ కార్డులు తీసుకుని వచ్చారు. గంటల తరబడి ఎండలో క్యూలైన్లలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి ఒక్క బస్తా చొప్పున ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.