రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తృటిలో తప్పిన ప్రమాదం
CTR: చిత్తూరులోని స్థానిక పీసీఆర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ RTC బస్సు, బైక్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని, బైక్ దెబ్బతిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.