VIDEO: సర్పంచ్ పోటీలో తోటి కోడళ్లు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తోటి కోడళ్లు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. బీసీ మహిళలకు రిజర్వ్ అయిన ఈ పదవికి కాంగ్రెస్కు నుంచి సుజాత, బీఆర్ఎస్ నుంచి మాధవి నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఆదివారం తమ అనుచరులతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.