సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిపై ప్రజలకు అవగాహన

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిపై ప్రజలకు అవగాహన

CTR: పుంగనూరు మండలం బయలుగానిపల్లిలో ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్సైలు ఆన్సర్ బాషా, కేవీ రమణ మాట్లాడుతూ.. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.