పందుల బెడదపై స్పందించిన కమిషనర్
కడప: బద్వేల్ పరిధిలో పందుల బెడద అధికంగా ఉండటంపై మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి స్పందించారు. పందుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని కాలనీ వాసులు కమీషనర్ దృష్టికి తీసుకరాగా.. కమీషనర్ వెంటనే స్పందించారు. పందులు వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు పందుల యజమానులతో మాట్లాడి 13వ వార్డు నుండి తరలించేలా చర్యలు తీసుకున్నారు.