పుంగనూరులో మారెమ్మకు విశేషాలంకారం

CTR: పుంగనూరు పాత బస్టాండ్ సమీపంలోని విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శిస్తున్నారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.