అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
TPT: పెళ్లకూరు మండలంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 14,34,400 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట రూరల్ సీఐ తెలిపారు. అలాగే పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.