రేపు దేవరకొండకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

రేపు దేవరకొండకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

NLG: దేవరకొండ మున్సిపాలిటీకి మిషన్ భగీరథ నీటి సరఫరాలో శనివారం అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్ తెలిపారు. గుడిపల్లి మండలం కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.