తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు: జిల్లా SP
BHPL: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుందనే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని BHPL ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. దళారులు, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని, అలాంటి అక్రమ నిల్వలు, ధరల ఎగబాకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.