మండపాలను సందర్శించిన డీఎస్పీ

మండపాలను సందర్శించిన డీఎస్పీ

కోనసీమ: మండపేట మండలం ఇప్పన పాడులో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాన్ని మంగళవారం రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పండగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ పి.దొర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.