సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
NTR: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను నందిగామ పట్టణంలోని సాయి మందిర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యసాయి జీవితంలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులతో కలిసి తిలకించారు.