'వివరాల సేకరణలో ఖచ్చితత్వం ఉండాలి'
NDL: సంజామల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జనగణన కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణలో భాగంగా సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తహాసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ట్రైనర్లు శ్రీనివాసులు, రాజశేఖర్ జనగణన విధానాలు, ఇంటింటి వివరాల సేకరణ, గృహాల లెక్కింపు, నమోదు ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.