మడకశిర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నజీర్ అహ్మద్
సత్యసాయి: మడకశిర నియోజకవర్గ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా గుడిబండ మండలం రాళ్లపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ నజీర్ అహ్మద్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు.