ఏటూరునాగారం గ్రామాభివృద్ధికి అమెరికా ఎన్నారై విరాళం
MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, లక్ష్మణ్ బాబు దంపతుల మేనకోడలు 2,000 డాలర్లు (సుమారు ₹1.83 లక్షలు) విరాళం ప్రకటించారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ నిధులతో మహిళా టాయిలెట్లు మరియు పారిశుధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.