మావోయిస్టు బాంబు పేలుడులో జవాన్కు తీవ్ర గాయాలు

MLG: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి తాడ్వాయి మండలం భూపతిపూర్కు చెందిన అలం మునేశ్ రెండు కాళ్లు కోల్పోయాడు. సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్లో పనిచేస్తున్న మునేశ్, గురువారం ఉదయం మందుపాతరలు తొలగించేందుకు వెళ్లగా బాంబు పేలింది. తీవ్రంగా గాయపడిన జవాన్లను వైద్యం కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.