'ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాని గెలిపించాలి'

NTR: గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజాను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి కోరారు. మైలవరంలో గురువారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గెలుపునకు కృషి చేయాలని ఆమె ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సమావేశం నిర్వహించింది. రాజా గెలుపును ప్రతి ఒక్కరు తమ గెలుపుగా భావించి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.