'వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి'
SRCL: వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఏఎంవీఐ రజనీ దేవి పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. అగ్రికల్చర్ పేరుతో ఉన్న ట్రాక్టర్లను రవాణాకు వినియోగించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము వాహనాల నంబర్ ప్లేట్లను ఉపయోగించాలని సూచించారు.