భార్య భర్తలపై దాడి
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం బాపనవారిపల్లిలో ఆదివారం ఉదయం భార్యాభర్తలపై దాడి జరిగింది. నరసింహులు, మమత దంపతులు సర్వే నంబర్ 357లో ఇల్లు నిర్మాణానికి గుంట తీయిస్తుండగా నజీర్ కుటుంబసభ్యులు వచ్చి వాగ్వాదానికి దిగినట్లు బాధితులు తెలిపారు. అనంతరం దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపైబ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.