హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
హనుమకొండలో గంజాయి నుంచి హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కువ లాభాలు వస్తాయని “పాండు” అనే వ్యక్తి సూచించడంతో ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వారి నుంచి సుమారు రూ.2.5 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శ్రీసన్ ప్రీత్సింగ్ తెలిపారు.