న్యాయం గెలిచింది.. అమరావతి నిలిచింది
ELR: అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ పోలవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు శనివారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. తన నివాసం వద్ద దీపాలు వెలిగించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయం గెలిచిందని, అమరావతి నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం ప్రజలందరి ఆకాంక్ష అన్నారు.