నేటితో ముగిసిన కౌన్సిలర్ల పదవీకాలం
ప్రకాశం: మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ల 5 ఏళ్ల పదవి కాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని వారు కలిసి సన్మానించారు. కౌన్సిలర్లుగా తమకు అవకాశం కల్పించినందుకు కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్లు షేక్ ఇస్మాయిల్, చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, ఇతర కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.