సంగమేశ్వర స్వామికి ద్వాదశ ప్రత్యేక పూజలు

SRD: జిల్లాలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో బుధవారం సంగమేశ్వర స్వామికి ద్వాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం కృష్ణ పక్షం సౌమ్యవాసరే పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్రంగా జలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.