గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు
NLR: కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన కన్నె ఆనంద్ రావు (42) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కావలి రూరల్ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడు ఈ నెల 21న సిరిపురంలో గడ్డిమందు తాగడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై రూరల్ ఎస్సై బాజిబాబు కేసు నమోదు చేశారు.