పురుగుమందు తాగి యువకుడు మృతి
BDK: ఆళ్లపల్లి మండలం కిచ్చనపల్లికి చెందిన సతీష్ (24) సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.