పోషణ పఖ్వాడా పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

పోషణ పఖ్వాడా పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

పల్నాడు: జిల్లాలో పిల్లలకు నాణ్యమైన పోషణ, ప్రాథమిక విద్యను అందించేందుకు పోషణ పఖ్వాడా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్తా అన్నారు. గురువారం అమరావతిలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పోషణ పఖ్వాడా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 9 నుండి 23 వరకు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించాలన్నారు.