పింఛన్ నోటీసులపై MRPS ఆందోళన

పింఛన్ నోటీసులపై MRPS ఆందోళన

NDL: మహానంది మండలం గాజులపల్లెలో 83 మంది డప్పు, చర్మకారుల పింఛన్ దారులకు నోటీసులు ఇవ్వడం దారుణమని MRPS జిల్లా నాయకులు కోలా కళ్యాణ్, దర్గయ్య విమర్శించారు. బాధితులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఇవాళ ఆందోళన చేపట్టారు. అనంతరం ఏవో శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యపై చర్చించి లబ్ధిదారులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.