ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
KMM: ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో కట్టకూరు రోడ్లో గల వడ్డేం సుగుణమ్మ పొలంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను సర్పంచ్ చెరుకుపల్లి జగన్నాధం గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివరాత్రి రాంబాబు, వార్డు సభ్యులు కొలికపొంగు మాధవరావు, ఏఈవో మౌనిక, VOA లు, సమైక్య అధ్యక్షులు రైతులు తదితరులు పాల్గొన్నారు.