పట్టెమ్మ చెరువులను పరిశీలించిన కలెక్టర్
ELR: ఉంగుటూరు (మం) నాచుగుంటలో ఉన్న పట్టెమ్మ చెరువును బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు MLA ధర్మరాజు పరిశీలించారు. చెరువును మరింత అభివృద్ధి చేసి, దీర్ఘకాలికంగా గ్రామానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీడీవో మనోజ్ తదితరులు పాల్గొన్నారు.