బ్రహ్మశ్రీ ఆశ్రమానికి మారిషస్ ప్రధానమంత్రి దంపతులు

TPT: రామచంద్రాపురం మండలంలోని బ్రహ్మశ్రీ గురుజీ సిద్దేశ్వర తీర్థ ఆశ్రమాన్ని మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాం గులాం దంపతులు సందర్శించారు. వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి స్వాగతం పలికారు. వీరికి గురూజీ ప్రత్యేక జ్ఞాపకలను అందించారు. ఆ దేశానికి విద్య, వైద్య అభివృద్ధికి 1000 మిలియన్ డాలర్లను వితరణ చేస్తున్నట్లు ప్రకటించారు.