పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలని డీఎస్పీకి వినతి

SRD: సంగారెడ్డి మండలంలో ఎక్కడైనా పాకిస్తాన్ జాతీయులు ఉంటే బహిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పాకిస్తాన్ జాతీయులు ఉంటే గుర్తించాలని కోరారు. వారిని పాకిస్తాన్కు పంపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.