నాటికల పోటీల్లో విద్యార్థుల సత్తా
BPT: కర్లపాలెం పరిధిలోని ఎంవీరాజుపాలెం ఎంపీపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి నాటికల పోటీల్లో వీరు అదరగొట్టారు. హిందీ, తెలుగు నాటికల్లో ప్రథమ స్థానం సాధించారు. ఇంగ్లిష్ నాటికలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. హెచ్ఎంలు విజయభాస్కరరెడ్డి, సౌజన్యలు విజేతలకు బహుమతులు అందజేశారు.