సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
BPT: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. సోమవారం బాపట్లలో 43 మంది లబ్ధిదారులకు రూ.20,73,963 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యమన్నారు.