కంభంలో నకిలీ నోట్ల కలకలం
ప్రకాశం: కంభంలోని ఓ చికెన్ షాపులో ఆదివారం నకిలీ కరెన్సీ ఘటన చోటుచేసుకుంది. షాప్ రద్దీగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి 100 నకిలీ నోటు ఇచ్చి చికెన్ తీసుకుని వెళ్లిపోయాడు. రద్దీ తగ్గిన తర్వాత డబ్బులు చూసిన షాప్ యజమానికి ఆ నోటు ఫేక్ అని తెలిసింది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ఆయన జరిగిన విషయాన్ని పరిచయస్తులకు తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.