VIDEO: 'ఆన్లైన్ బుకింగ్ ఐదు సెకన్లలో ముగింపు'
GDWL: పత్తి కొనుగోలు కేంద్రంలో అధికారులు, దళారుల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తీవ్ర ఆరోపణ చేశారు. రోజుకు 2,300 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతులు ఉన్నా, ఆన్లైన్ బుకింగ్ను ఐదు సెకన్లలోనే నిలిపివేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఉండవల్లి వరసిద్ధి వినాయక కాటన్ మిల్లును సందర్శించారు.