కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్న ప్రశాంత్ రెడ్డి
NZB: మాజీ మంత్రి, బాల్కండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యేకు సూచించారు.