యుద్ధం.. భగ్గుమంటున్న క్రూడాయిల్ ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 83.86 డాలర్ల వద్ద చేరుకుంది. ఈ ఒక్క వారంలోనే క్రూడ్ ధర ఏకంగా 12 శాతం పెరగడం గమనార్హం. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.