T20 WC: ఫైనల్కు రెండు వేదికలు!
భారత్, శ్రీలంక సంయుక్తంగా 2026 టీ20 ప్రపంచకప్ను నిర్వహిస్తున్నాయి. అయితే, పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్లు శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. పాక్ ఫైనల్కు చేరుకుంటే, శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫైనల్ నిర్వహిస్తారు. ఒకవేళ పాక్ ఫైనల్కు అర్హత సాధించలేకపోతే, భారత్ వేదికగా అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది.