సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో
SKLM: పొందూరు మండలంలోని తండ్యంలో ఇవాళ ఎంపీడీవో వాసుదేవారావు స్థానిక సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడి సేవల అందుబాటు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వివరాలు సేకరించారు. అత్యవసర సేవల అమలు పరిస్థితిని తెలుసుకునేందుకు SWPC సెడ్ను కూడా పరిశీలించారు.