మిరప సస్యరక్షణపై రైతులకు అవగాహన

మిరప సస్యరక్షణపై రైతులకు అవగాహన

GNTR: ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు, యర్రగుంట్ల పాడు గ్రామాల్లో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిరప పంటపై సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త డా. సి.హెచ్. అనిల్‌కుమార్ మిరపలో కనిపించే నల్ల తామర పురుగు, బొబ్బర తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వివరించారు.