రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
NLR: కందుకూరు శివారులో మంగళవారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్తో పాటు బైక్పై వెళుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.