విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలు
SDPT: బెజ్జంకి మండలం దాచారంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచనలతో పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బైరి మానస రాజేందర్ విద్యుత్ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.