కారును ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
బాపట్ల-చీరాల హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఉన్న ఓ కారును వెనుక నుంచి పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.