గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం ఉండవెల్లిలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, స్టోర్ రూమ్, భోజనశాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.