రేపు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో శుక్రవారం మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ వర ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నామని, ఈ సమావేశంలో తాగునీరు, అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.