వేములపాడులో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

వేములపాడులో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు రహదారిపై ఎస్సై మాధవరావు శుక్రవారం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక సీటులో కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.